భార్య అక్రమ సంబంధం, బిడ్డలకు విషం పెట్టి చంపి ఆపై!

Wednesday, July 22, 2020 12:23 PM Crime
భార్య అక్రమ సంబంధం, బిడ్డలకు విషం పెట్టి చంపి ఆపై!

ఇద్దరు కుమారులతో కలిసి దంపతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఉద్యోగం చేస్తున్న చోట భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన భర్త భార్యను పలుమార్లు మందలించాడు. ఎలాగూ అందరికీ తెలిసిపోయిందని భర్త, పిల్లలను గాలికి వదిలేసి ప్రియుడితో ఎంజాయ్ చెయ్యడానికి వెళ్లిపోయింది. నీ భార్య పరాయివాడితో వెళ్లిపోయిందని భర్తను చూసినవాళ్లు ఆడిపోసుకోవడంతో భర్తకి జీవితంపై విరక్తి చెందింది

భార్య ప్రియుడిని కత్తితో పొడిచి ఇద్దరు కొడుకులను హత్య చేసి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలలోకి వెళితే తమిళనాడులోని మదురై జిల్లా పాలమేడులోని బృందానగర్ లో కుమార్ (42), ఉషారాణి (35) దంపతులు నివాసం ఉంటున్నారు. కుమార్, ఉషారాణి దంపతులకు కుబేర పెరుంచోళన్ (8), సిద్దార్థ్ (6) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండు సంవత్సరాల క్రితం వరకు కుమార్, ఉషారాణి దంపతులు కాపురం సవ్యంగానే సాగిపోయింది. కుమార్ ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. పాలమేడు పట్టణ పంచాయితీలో ఉషారాణి పారిశుద్ద విభాగంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నది. తాను ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నానని, నువ్వు చీప్ గా ఆటో డ్రైవర్ అని రెండు సంవత్సరాల నుంచి భర్త కుమార్ తో ఉషారాణి గొడవ చేసేది. ఇదే సమయంలో పట్టణ పంచాయితీలో సీనియర్ అధికారిగా పని చేస్తున్న కనకరాజ్ అనే ఉద్యోగితో ఉషారాణి చనువుగా ఉండటం మొదలుపెట్టింది.

ఉషారాణితో చనువుగా ఉంటున్న కనకరాజు ఆమెను వలలో వేసుకున్నాడు. తరువాత కనకరాజు ఏం చూపించాడో ? ఏమో ? ఉషారాణి అతని వలలో పడిపోయింది. వచ్చే జీతంలో అర్దం డబ్బులు కనకరాజ్ జల్సాలకు తగలేస్తున్న ఉషారాణి అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. జీతం డబ్బులు ఏమవుతున్నాయి అని భర్త కుమార్ అడితే నా జీతం, నా ఇష్టం అనేది.

For All Tech Queries Please Click Here..!