మేనమామ కాదు కీచకుడు...కోడల్ని రేప్ చేసి...హత్య చేసి దారుణం

Thursday, December 3, 2020 12:00 PM Crime
మేనమామ కాదు కీచకుడు...కోడల్ని రేప్ చేసి...హత్య చేసి దారుణం

దేశ రాజధాని ఢిల్లీలో వరుస అత్యాచార ఘటనలు కలకలం రేపుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా నేరస్తులకు చీమకుట్టినట్లు కూడా లేకుండా పోయింది. తాజాగా బాధితురాలి మేనమామనే రేప్ చేసి 17 ఏళ్ల బాలికను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆమెను సొంత మేనమామ దారుణంగా రేప్ చేసి హత్య చేసాడు అని పోలీసులు చెప్పారు. బాధితురాలు మామ, అత్తతో కలిసి దేశ రాజధాని ఢిల్లీలో నివాసం ఉంటుంది. ఆమెను చంపి మృతదేహాన్ని బెడ్ బాక్స్ లో దాచిపెట్టారు. ఈశాన్య ఢిల్లీలోని నందనాగ్రి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అక్టోబర్ 23 నుండి బాలిక కనపడలేదు. ఆ తర్వాత కుళ్ళి వాసన రావడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఆ తర్వాత ఆమె మేనమామ అక్కడ నుంచి పారిపోగా అతనిని బీహార్ లో అదుపులోకి తీసుకున్నామని డిప్యూటీ పోలీస్ కమిషనర్ (ఈశాన్య) వేద్ ప్రకాష్ సూర్య తెలిపారు. అతను కనపడకపోవడంతోనే అతని మీద అనుమానం వచ్చింది అని పోలీసులు పేర్కొన్నారు.
 

For All Tech Queries Please Click Here..!