చనిపోయిన చిన్నారి బతికొస్తుందని.. దేవుడి ముందు పెట్టి దారుణంగా...

Tuesday, November 19, 2019 09:25 AM Crime
చనిపోయిన చిన్నారి బతికొస్తుందని.. దేవుడి ముందు పెట్టి దారుణంగా...

మనం ఎంత డెవలప్ అయినా కొందరిలో మూఢ విశ్వాసాలు మాత్రం తగ్గడం లేదు. దేవుడు అని కొన్ని అభూత కల్పనలను గుడ్డిగా నమ్మేస్తున్నారు. భగవంతుడి పేరు చెప్పి చనిపోయిన వారు కూడా బతికొస్తారని చెప్తున్నారు. ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా నాలుగురోజులు తమ చిన్నారి పార్థీవదేహంతో గడిపారు.

వివరాలలోకి వెళితే యూపీలోని మావ్ జిల్లాకు చెందిన అరవింద్ ఇటుక బట్టీలో కూలీగా పనిచేస్తాడు. అతనికి భార్య, నాలుగేళ్ల కూతురు ఉన్నారు. అతను ఆరేళ్ల క్రితం క్రిస్టియన్ మతంలో చేరాడు. అంతా బాగానే ఉంది. కానీ అతని కూతురు ఈ నెల 14న చనిపోయింది. చనిపోతే దహన సంస్కరాలు జరిపించాలి. కానీ అరవింద్ అలా చేయలేదు. తన స్నేహితులు చెప్పిన మాట విని చిన్నారిని జీసస్, బైబిల్ ముందు ఉంచారు. క్రిస్టియానిటీని నమ్మిన అరవింద్ వారి సూచనకు ఈ విదంగా చేసాడు. గత నాలుగురోజుల నుంచి చిన్నారిని జీసస్ ముందు ఉంచినా ఆమెలో కదలిక లేదు. అయితే ఈ విషయాన్ని కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు రంగంలోకి దిగారు.

అరవింద్ ఇంటికి చేరుకున్న ఇన్‌స్పెక్టర్ అనురాగ్ కుటుంబసభ్యులకు నచ్చజెప్పారు. చనిపోయిన చిన్నారిని ఇలా ఉంచడం సరికాదని సూచించారు. వారి వాదనతో తల్లిదండ్రులు ఏకీభవించారు. చిన్నారి అంత్యక్రియలు పూర్తి చేశారు. దీంతో గొడవ సద్దుమణిగింది. కానీ స్థానికంగా మాత్రం ఈ ఘటన కలకలం రేపింది.

For All Tech Queries Please Click Here..!
Topics: