బయటపడ్డ పాకిస్తాన్ గూఢచర్యం, జాగ్రత్త పడుతున్న భారత్.

Tuesday, May 26, 2020 12:15 PM Crime
బయటపడ్డ పాకిస్తాన్ గూఢచర్యం, జాగ్రత్త పడుతున్న భారత్.

గూఢచర్యంలో పాకిస్థాన్ జిత్తులమారితనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఓ పావురం పాక్ వైపు నుంచి భారత్ లోకి ప్రవేశించడం కలకలం రేపుతోంది. ఆ పావురం కాలికి అనుమానాస్పద రీతిలో ఓ రింగ్ తొడిగి ఉంది. ఆ రింగ్ పై కొన్ని సంకేతాక్షరాలు ఉండడంతో అది కచ్చితంగా గూఢచర్యంలో భాగం అయ్యుంటుందని భావిస్తున్నారు.

జమ్మూకశ్మీర్ లోని కథువా జిల్లాలో మన్కారీ గ్రామంలో ఈ ఘటన జరిగింది. సరిహద్దు వద్ద పావురాన్ని పట్టుకున్న గ్రామస్తులు దాన్ని పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం పోలీసులు పావురం కాలికి ఉన్న రింగ్ ను పరిశీలిస్తున్నారు. రింగ్ ఉన్న కోడ్ లాంగ్వేజిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

For All Tech Queries Please Click Here..!
Topics: