అప్పటి వరకూ ఎంజాయ్ చేసింది.. కానీ అంతలోనే విషాదం నింపింది

Friday, October 11, 2019 09:46 AM Crime
అప్పటి వరకూ ఎంజాయ్ చేసింది.. కానీ అంతలోనే విషాదం నింపింది

థాయిలాండ్ లో విషాదం చోటు చేసుకుంది, ఓ ఇండియన్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కన్నుమూసింది. మధ్యప్రదేశ్ కి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ప్రగ్యా పలివాల్(29) థాయిలాండ్ లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది. ప్రస్తుతం ఆమె మృతదేహం థాయిలాండ్ లోని ఓ హాస్పిటల్ ఉంచారు. మృతురాలికి సంబందించిన కుటుంబసభ్యులు ఎవరైనా వస్తే వారికి మృతదేహాన్ని అప్పగిస్తామని అక్కడి అధికారులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ కి చెందిన ప్రగ్యా బెంగళూరులోని హాంగ్ కాంగ్ బేస్డ్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. కంపెనీ వార్షిక సమావేశం కోసం ఆమె థాయిలాండ్ వెళ్లారు. అక్కడ జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు.

ఆమె చనిపోయిన వార్త ముందుగా ప్రగ్యా స్నేహితురాలికి తెలిసింది. ఆమె వెంటనే ఈ సమాచారాన్ని వారి కుటుంబసభ్యులకు తెలియజేసింది. వార్త తెలుసుకున్న ప్రగ్యా కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు. వెంటనే తమ కుమార్తె మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి సహాయం చేయాలంటూ స్థానిక ఎమ్మెల్యే అలోక్ చతుర్వేదిని కోరారు. దీంతో ఆయన వారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని అక్కడి ముఖ్యమంత్రి కమల్ నాథ్, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు థాయిలాండ్ లోని భారత రాయబార కార్యాలయ అధికారులు ఆమె మృతదేహాన్ని త్వరలోనే స్వస్థలానికి పంపిస్తామని చెప్పారు. అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

For All Tech Queries Please Click Here..!
Topics: