భర్తను వదిలేసి ఏడేళ్లుగా ప్రియుడితో కాపురం, ఆమెపై అనుమానంతో...!

Tuesday, June 4, 2019 03:20 PM Crime
భర్తను వదిలేసి ఏడేళ్లుగా ప్రియుడితో కాపురం, ఆమెపై అనుమానంతో...!

పెళ్లైంది భర్తతో సంసారం కొంతకాలం బాగానే జరిగింది, అయితే ప్రియుడి మోజులో పడి భర్తను వదిలేసింది,  ప్రియుడితో కాపురం పెట్టింది. ఏడేళ్ల పాటు కలిసి ఉన్న ఈ జంట మధ్య అనుమానం చిచ్చు పెట్టింది. ఏడేళ్లుగా సహజీవనం చేస్తున్న ప్రియురాలిపై అనుమానం రావటంతో ఆమెను అతికిరాతకంగా చంపేశాడు ప్రియుడు. ఆంధ్రపద్రేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం గ్రామంలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. నక్కలపేట గ్రామానికి చెందిన బాలరాజు (47), సరోజిని(45) ఏడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. బాలరాజుకు ముందే అముదాలవలసకు చెందిన యువతితో పెళ్లి కాగా ఇద్దరూ విడిపోయారు. సరోజినికి 9 ఏళ్ల క్రితం వీరఘట్టం గ్రామానికి చెందిన వ్యక్తితో పెళ్లైంది. పెళ్లైన రెండేళ్లకు బాలరాజు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీయడంతో ఇద్దరూ కట్టుకున్న వారి నుంచి విడిపోయి. ఏడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఇద్దరూ కలిసి నక్కలపేట గ్రామంలో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు.

అయితే కొన్నాళ్లుగా సరోజిని ప్రవర్తనపై బాలరాజు అనుమానం వచ్చింది. మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందనే అనుమానంతో మద్యానికి బానిసయ్యాడు బాలరాజు. రోజూ ఫుల్లుగా తాగి వచ్చి, సరోజినిని కొడుతూ, తిడుతూ చిత్రహింసలకు గురి చేసేవాడు. శుక్రవారం రాత్రి కూడా ఇదే విషయంలో గొడవ జరిగింది.గొడవ సర్దుమనిగాక నిద్రపోయేందుకు మేడపైకి వెళ్లారు. అక్కడ కూడా గొడవ జరగడంతో తీవ్ర ఆవేశానికి లోనైన బాలరాజు, సరోజినిని తీవ్రంగా కొట్టాడు. దెబ్బలకు ఆమె స్పృహ తప్పి పడపోవడంతో మేడపై నుంచి కిందకి పడేశాడు. అమాంతం మేడ పైనుంచి కిందపడడంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. సంఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు 108 ఫోన్ చేసి సమాచారం అందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సరోజిని ప్రాణాలు కోల్పోయింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు బాలరాజును అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

For All Tech Queries Please Click Here..!