ఒంగోలు ఘటనపై స్పందించిన హోంమంత్రి..!
ఒంగోలులో 16 ఏళ్ల బాలికపై ఆరుగురు గ్యాంగ్రేప్ చేసిన ఘటనపై ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత సీరియస్గా స్పందించారు. ఈ ఘటనపై విచారణ వేగవంతం చేయాలని ప్రకాశం జిల్లా ఎస్పీని ఆమె ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు, ఒంగోలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత బాలికను మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి పరామర్శించారు. నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టమని ఆయన స్పష్టం చేశారు. బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉంటుందననారు. మైనర్ బాలికపై సామూహిక అత్యాచార ఘటనను నిరసిస్తూ ఒంగోలులో మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు ఆందోళనకు దిగాయి. రేప్కేసు నిందితులను కఠినంగా శిక్షించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని మహిళా నేతలు డిమాండ్ చేస్తున్నారు.
పది రోజుల క్రితం యువతి ఒంగోలుకు చేరుకుంది. బస్టాండ్లో దిగిన వెంటనే రాముకు ఫోన్ చేసింది. అయితే ఫోన్ కలవకపోవడంతో అక్కడే కూర్చొని ఎదురుచూసింది. బాలిక బస్సు దిగినప్పటి నుంచి తనను గమనిస్తున్న ఓ దివ్యాంగుడు ఆమె వద్దకు వెళ్లాడు. రాము తనకు తెలుసని నమ్మబలికాడు. మాయమాటలు చెప్పి బాలికను బస్టాండు సమీపంలోని తన గదికి తీసుకెళ్లాడు. అక్కడికి తన స్నేహితున్ని పిలిచి ఇద్దరూ కలిసి ఆ రాత్రి ఆమెపై అత్యాచారం చేశారు. వారు అంతటితో ఆగలేదు యువతిని దగ్గరలోని మరో గదికి తీసుకెళ్లి అక్కడున్న నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులకు అప్పగించాడు. అప్పటి నుంచి ఆ నలుగురు ఆమెకు నరకం చూపారు. వంతులవారీగా అత్యాచారం చేశారు. ఆమె ఎదురు తిరిగితే చిత్రహింసలు పెట్టారు. పది రోజుల పాటు ప్రత్యక్ష నరకాన్ని అనుభవించిన బాలిక శనివారం అదును చూసుకొని గదిలోంచి బయటపడింది.
కామాంధుల చెర నుంచి బయటపడ్డ యువతి ఆర్టీసీ బస్టాండ్కు చేరుకుని ఏడుస్తూ కూర్చుంది. అక్కడ పోలీస్ ఔట్ పోస్ట్లో ఉన్న ఓ కానిస్టేబుల్ ఆమెను గమనించి విషయం ఆరా తీశాడు. తనపై జరిగిన దారుణాన్ని యువతి చెప్పడంతో పై అధికారికి సమాచారం ఇచ్చారు. యువతి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసిన పోలుసులు ఆమెకు వైద్య పరీక్షలు చేయించారు. దివ్యాంగుడిని అదుపులోకి తీసుకొని విచారించగా అతనిచ్చిన సమాచారంతో నిందితుల్లో ముగ్గురు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు.