అందరూ చూస్తుండగా నడిరోడ్డు మీద చంపేశారు

Monday, February 22, 2021 03:00 PM Crime
అందరూ చూస్తుండగా నడిరోడ్డు మీద చంపేశారు

Ghaziabad, December 29: ఉత్తరప్రదేశ్ లో అందరూ చూస్తుండగా ఓ వ్యక్తిని నడిరోడ్డు మీద కొందరు వ్యక్తులు దారుణంగా కొట్టి (Man Lynched in Loni Area) చంపేశారు. ఆ దారిన పోయే బాటసారులు మనకెందుకులే అని చోద్యం చూస్తూ నిలబడ్డారే తప్ప ఇది తప్పని ఎవరూ చెప్పలేదు. చెబితే ఏం చేస్తారోననే భయం వారిని వెంటాడినట్లు తెలుస్తోంది. బాధితుడిని కాపాడే ప్రయత్నం చేయని బాటసారులు ఆ అమానుష చర్యను వీడియోలు తీస్తూ దూరంగా నిలబడ్డారు. 

ఉత్తరప్రదేశ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘజియాబాద్‌లోని లోనీకి చెందిన సంజయ్‌, గోవింద్‌కు మధ్య కొన్ని రోజుల క్రితం గొడవ జరిగింది. పూలకొట్టు పెట్టే విషయంలో స్థల కేటాయింపు విషయంలో ఇరువర్గాల మధ్య ఈ ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో గోవింద్‌ సంజయ్‌పై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం సంజయ్‌ సోదరుడు అజయ్‌ లోనీ మార్గం గుండా వెళ్తుండగా, అతడిని అటకాయించాడు. తన స్నేహితుడు అమిత్‌తో కలిసి కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశాడు.

 

దీంతో అజయ్‌ రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనపై సంజయ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. నిందితులు గోవింద్‌, అమిత్‌లను అరెస్టు చేసి విచారణ చేపట్టారు. కాగా పోలీసులు సత్వరమే స్పందించి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదని మృతుడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.  

For All Tech Queries Please Click Here..!