ప్రియుడి ముందే ప్రియురాలు గ్యాంగ్ రేప్‌

Friday, May 10, 2019 07:55 AM Crime
ప్రియుడి ముందే ప్రియురాలు గ్యాంగ్ రేప్‌

కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఆరుగురు కామాంధులు ప్రియుడి ముందే యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసుల సమాచారం ప్రకారం మైసూరు నగర శివార్లలోని లింగాంబుధి చెరువు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని ఓ లాడ్జిలో పనిచేస్తున్న ఓ యువతి, యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. బుధవారం రాత్రి వీరిద్దరూ లింగాంబుధి చెరువు వద్దకు సరదాగా కబుర్లు చెప్పుకొనేందుకు వెళ్లారు. అదే సమయంలో ఆరుగురు యువకులు కారులో అక్కడికి వచ్చారు. మద్యం మత్తులో యువతిని చూసిన ఆ కామాంధులు యువకుడిని తాళ్లతో చెట్టుకు కట్టేసి యువతిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. సమాచారం అందుకున్న జయపుర పోలీసులు కేసు నమోదు చేశారు. కామాంధుల్ని పట్టుకొనేందుకు మూడు బృందాల్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ప్రియుడు, ప్రియురాలు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.

For All Tech Queries Please Click Here..!