అద్దెకారులో తీసుకెళ్లి.. దుస్తులు లేకుండా ఒకరి తర్వాత ఒకరు..

Tuesday, April 7, 2020 04:37 PM Crime
అద్దెకారులో తీసుకెళ్లి.. దుస్తులు లేకుండా ఒకరి తర్వాత ఒకరు..

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లి గ్రామ వంతెన కింద గత నెల 17న ఓ వివాహిత మృతదేహం లభ్యమయ్యింది. పోలీసుల విచారణలో ఈ కేసుకు సంబంధించి విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. తనని పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చినందుకే పథకం ప్రకారం ఆమెను ప్రియుడే హత్య చేసినట్టు సైబరాబాద్‌ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు.

వివరాలలోకి వెళితే మరో స్నేహితుడితో కలిసి ఆమెను లాంగ్ డ్రైవ్‌కి తీసుకెళ్లిన ప్రియుడు మార్గమధ్యలో ఆమెపై అత్యాచారం జరిపి హత్య చేసినట్టు విచారణలో తేలింది. మృతురాలికి వివాహమైంది. ఆమె పెళ్లికి ముందు ఓ యువకుడితో ప్రేమలో ఉంది. పెళ్లి తర్వాత కూడా అతనితో సన్నిహితంగానే ఉంటూ వచ్చింది. ఇదే క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని ఎక్కడికైనా వెళ్లిపోయి ఆనందంగా బతుకుదామని అతనిపై ఒత్తిడి తెచ్చింది. అయితే అప్పటికే వేరే అమ్మాయికి దగ్గరైన ఆ యువకుడు ఆమెను దూరం పెడుతూ వచ్చాడు. అయినప్పటికీ ఆమె తరుచూ పెళ్లి గురించి ఒత్తిడి చేస్తూనే ఉంది. దీంతో ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలనే ఉద్దేశంతో ప్రియుడే హత్యకు పథకం రచించాడు.

లాంగ్ డ్రైవ్‌కు వెళ్దామంటూ ఆమెను పిలిచిన ప్రియుడు కారులో ఎక్కించుకుని హైదరాబాద్ నుంచి బయలుదేరాడు. మరో స్నేహితుడిని కూడా వెంట తీసుకెళ్లాడు. కొంత దూరం వెళ్లాక కారును ఒక నిర్మానుష ప్రదేశంలో ఆపి ఆమెపై ఇద్దరూ అత్యాచారం చేసి గొంతు నులిమి చంపేశారు. అనంతరం అనంతరం తంగడపల్లి వంతెన వద్దకు చేరుకుని, మృతదేహాన్ని వంతెన కిందకు తీసుకెళ్లి ముఖంపై బండరాయితో మోదారు. గంట పాటు అక్కడే ఉండి ఆ బండరాయిని కూడా తమతో తీసుకుని వెళ్లిపోయారు.నిందితులు అద్దెకు తీసుకున్న కారు జీపీఎస్‌ ఈ కేసులో కీలక ఆధారంగా మారింది. దాని ఆధారంగా నిందితులు తంగడపల్లి నుంచి నుంచి ఎన్కేపల్లి, ప్రగతి రిసార్ట్స్‌, ప్రొద్దుటూరు మీదుగా నార్సింగి ఇంటర్‌ఛేంజ్‌ నుంచి ఓఆర్‌ఆర్‌పైకి చేరినట్టు గుర్తించారు. ప్రొద్దుటూరు దగ్గర లభించిన సీసీ ఫుటేజీ ద్వారా ఈ ఇద్దరే నేరానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

For All Tech Queries Please Click Here..!
Topics: