విద్యార్థిని ప్రేమించి పంచేశాడు, 10 మంది లైంగిక దాడి, తల్లిని చేసి..!

Wednesday, April 15, 2020 05:45 PM Crime
విద్యార్థిని ప్రేమించి పంచేశాడు, 10 మంది లైంగిక దాడి, తల్లిని చేసి..!

అభం శుభం తెలియని 9వ తరగతి విద్యార్థిని ప్రేమ పేరుతో వంచించి లైంగిక దాడి చేశాడు. ఆ తరువాత నలుగురు స్నేహితులకు తన ప్రియురాలిని పంచేశాడు. ఆ విషయం తెలుసుకున్న మరికొంతమంది స్నేహితులు బెదిరించి ఆమెపై అత్యాచారం చేసారు. ఈ కేసులో మొత్తం 7 మందిని పోలీసులు అరెస్టు చేయగా. ఇదే విధంగా బాలికను పదేపదే లైంగిక దాడికి గురి చేసిన మరో ముగ్గురి కోసం తమిళనాడులోని కోయంబత్తూరు పోలీసులు గాలిస్తున్నారు. 10 మంది బాలికపై లైంగిక దాడికి పాల్పడటంతో ఆ అమ్మాయి చాలా అనారోగ్య స్థితిలో ఉంది ఆ పైగా గర్బవతి కూడా అయ్యింది. ప్రేమ పేరుతో బాలికను తల్లిని చేసిన వారిలో మైనర్లు ఉన్నారని, బాలికకు వైద్యపరీక్షలు చేయిస్తున్నామని కోయంబత్తూరు పోలీసులు తెలిపారు.

వివరాలలోకి వెళితే కోయంబత్తూరులో భవన కార్మికులు నివాసం ఉంటున్నారు. భావన కార్మికుడి కుమార్తె (15) వారు నివాసం ఉంటున్న ప్రాంతంలోని ఓ స్కూల్ లో 9వ తరగతి చదువుతున్నది.  కడుపునొప్పి ఎక్కువ కావడంతో ఆమెను తల్లిదండ్రులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలికకు వైద్యపరీక్షలు చేసిన వైద్యులు ఆమె గర్బవతి అని తేల్చటంతో తల్లిదండ్రులు షాక్ కు గురైనారు. వెంటనే కోవై ఈస్ట్ మహిళా పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన మహిళా పోలీసులు బాలికను ఆసుపత్రికి తరలించారు. అయితే తనకు కరోనా వైరస్ చికిత్స చేస్తున్నారనే భయంతో ఆ బాలిక ఆసుపత్రి నుంచి తప్పించుకుని పారిపోయింది. పోలీసులు గాలించి చివరికి బాలిక తలదాచుకున్న ప్రాంతాన్ని గుర్తించి ఆమెను మరలా హాస్పిటల్లో చేర్చారు. పోలీసులు విచారించగా ప్రేమ పేరుతో తనతో చనువుగా మెలిగిన యువకుడు, అతని స్నేహితులు తన మీద అత్యాచారం చేశారని బాలిక తెలిపింది. బాలిక చెప్పిన వివరాల ఆధారంగా ప్రేమ పేరుతో మోసం చేసిన ప్రియుడు, అతని స్నేహితులతో పాటు మొత్తం 7 మందిని అదుపులోకి తీసుకున్నారు. బాలిక మీద అత్యాచారం చేశామని అంగీకరించిన ధనశేఖర్ (24), కార్తీక్ (23), సంతోష్ (20)తో పాటు ప్లస్ వన్ , ప్లస్ టూ (ఇంటర్) చదువుతున్న మరో నలుగురిని కోవై ఈస్ట్ మహిళా పోలీసులు అరెస్టు చేశారు. 

For All Tech Queries Please Click Here..!
Topics: