ఆగష్టు 21న వస్తోన్న మారుతి సుజుకి కొత్త కారు వివరాలు..!

Wednesday, August 7, 2019 10:12 AM Automobiles
ఆగష్టు 21న వస్తోన్న మారుతి సుజుకి కొత్త కారు వివరాలు..!

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లోకి అతి త్వరలో మరో కొత్త కారును పరిచయం చేయనుంది. ఆగష్టు 21వ తేదీన విపణిలోకి సరికొత్త 6-సీటర్ ఖరీదైన ఎంపీవీ కారును లాంచ్ చేయనుంది. ఇది మారుతి ఇండియా లైనప్‌లోనే అత్యంత ఖరీదైన మోడల్‌గా నిలవనుంది.

సేల్స్ పెంచుకునేందుకు మార్కెట్లో నూతన ఒరవడికి తెరదించుతున్న మారుతి సుజుకి ఇప్పటికే మార్కెట్లో లభించే మారుతి ఎర్టిగా ఎంపీవీ మోడల్ ఆధారంగా ఈ ఖరీదైన కారును రూపొందిస్తోంది. చాలా మందికి తెలియని ఈ నిజాన్ని మారుతి అత్యంత గోప్యంగా ఉంచుతూ కొత్త గాలిని పరిచయం చేస్తున్నట్లు ప్రయత్నిస్తోంది.

మారుతి తమ ఎక్స్ఎల్6 మోడల్ ఎంపీవీ కారును ఇండియన్ రోడ్ల మీద ఇప్పటికే పలుమార్లు రహస్యంగా పరీక్షించింది. తాజాగా నిర్వహించిన టెస్టింగ్‌లో ఈ సరికొత్త మారుతి ఎక్స్ఎల్6 మోడల్ మారుతి ఎర్టిగా కంటే పరిమాణంలో పెద్దదని తేలింది. పొడవు మరియు ఎత్తు రెండింటి పరంగా ఎక్స్ఎల్6 ఎర్టిగా కంటే పెద్దదిగా ఉంటుంది.

For All Tech Queries Please Click Here..!
Topics: