భారీగా పెరిగిన మారుతి సుజుకి డిజైర్ ధరలు

Friday, June 21, 2019 04:46 PM Automobiles
భారీగా పెరిగిన మారుతి సుజుకి డిజైర్ ధరలు

మారుతి సుజుకి డిజైర్ కాంపాక్ట్ సెడాన్ కారును నూతన భద్రతా ప్రమాణాలు, బిఎస్-6 ఇంజన్‌తో లాంచ్ చేసింది. వేరియంట్ల వారీగా ధరలు కూడా పెంచింది. 2019 జూలై 01 నుండి అమ్ముడయ్యే ప్రతి ప్యాసింజర్ కారు కూడా నూతన భద్రత ప్రమాణాలను పాటించాలి. ఈ క్రమంలో పలు కార్ల సంస్థలు తమ కార్లలో నూతన సేఫ్టీ ఫీచర్లను అప్‌గ్రేడ్‌ చేసి కొత్త ధరలను నిర్ణయించి మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. 

మారుతి సుజుకి మాత్రమే కాదు, దేశీయ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కూడా తమ అన్ని ప్యాసింజర్ వాహనాలలో సేఫ్టీ ఫీచర్లను అందించి, సుమారుగా రూ. 36,000 వరకు ధరలు పెంచినట్లు ప్రకటించింది. ఇదే బాటలో మారుతి సుజుకి ప్రస్తుతం విక్రయిస్తున్న అన్ని కార్లలో తప్పనిసరి సేఫ్టీ ఫీచర్లను అందిస్తోంది. ఈ వారంలో స్విఫ్ట్ మరియు వ్యాగన్ ఆర్ మోడళ్లను అప్‌గ్రేడ్ చేసింది.

మారుతి సుజుకి నూతన భద్రత ఫీచర్లను అందివ్వడంతో పాటు 2020 నుండి అమల్లోకి వచ్చే బిఎస్-6 ఇంజన్‌ను కూడా అందించి డిజైర్ కారును లాంచ్ చేసింది. మారుతి డిజైర్ బిఎస్-6 మోడల్ ధరల శ్రేణి రూ. 5.82 లక్షలతో మొదలుకొని రూ. 9.75 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉన్నాయి. అంటే మునుపటి ధరలతో పోల్చుకుంటే దాదాపు రూ. 15,000 వరకు పెరిగాయి.

For All Tech Queries Please Click Here..!