దుమ్ములేపుతున్న హ్యుందాయ్ వెన్యూ సేల్స్

Saturday, June 22, 2019 04:07 PM Automobiles
దుమ్ములేపుతున్న హ్యుందాయ్ వెన్యూ సేల్స్

హ్యుందాయ్ మోటార్స్ ఇండియా మే 21, 2019 న దేశీయ విపణిలోకి సరికొత్త వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీని విడుదల చేసింది. విడుదలైన అనతి కాలంలోనే హ్యందాయ్ వెన్యూ మోడల్‌‌కు ఊహించని స్పందన లభించింది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఏకంగా 33,000 వెన్యూ ఎస్‌యూవీలను కస్టమర్లు బుక్ చేసుకున్నట్లు సంస్థ తెలిపింది. అంతే కాకుండా, హ్యుందాయ్ వెన్యూ ఎస్‌యూవీ గురించి ఇప్పటి వరకు ఏకంగా 2 లక్షల మంది ఆసక్తికనబరిచినట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. 

హ్యుందాయ్ ఇండియా సేల్స్ విభాగాధిపతి వికాస్ జైన్ మాట్లాడుతూ సరిగ్గా విడుదలైన నెల రోజుల్లోనే 33,000 వెన్యూ కార్ల బుకింగ్స్ నమోదయ్యాయి మరియు ఒక్క రోజులోనే 1,000 కార్లను డెలివరీ కూడా ఇచ్చాము. హ్యుందాయ్ వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఎంచుకున్న కస్టమర్లకు మంచి సంతృప్తినిచ్చి, హ్యుందాయ్ ఇండియా సక్సెస్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని అని ధీమా వ్యక్తం చేశారు.

For All Tech Queries Please Click Here..!