ముందుగానే వచ్చేసాయి.. ఇక దబిడి దిబిడే..

Sunday, May 25, 2025 07:20 AM Weather
ముందుగానే వచ్చేసాయి.. ఇక దబిడి దిబిడే..

నైరుతి రుతుపవనాలు శనివారం కేరళలో ప్రవేశించాయని, రెండు మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. ఈసారి

ఎనిమిది రోజులు ముందుగానే కేరళలో ప్రవేశించాయని, గతంలో ఇలానే మే 23, 2009 న రుతుపవనాలు ముందుగా ప్రవేశించాయని వివరించారు. తూర్పుమధ్య అరేబియా సముద్రంలో దక్షిణ కొంకణ్ తీరానికి సమీపంలోని వాయుగుండం గడిచిన 6 గంటల్లో 5 కి.మీ వేగంతో తూర్పు వైపుకు నెమ్మదిగా కదులుతుందన్నారు. ఇది రత్నగిరి సమీపంలో దక్షిణ కొంకణ్ తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు తెలిపారు. మంగళవారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపధ్యంలో రాష్ట్రంలో రానున్న మూడు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 40-50కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర నిలబడరాదన్నారు. పిడుగులతో కూడిన వర్షాలు నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇప్పటినుంచే ఉద్యానవన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఆదివారం అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి,కాకినాడ, తూర్పుగోదావరి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో 46.2, అరకబద్రలో 43,కోనసీమ జిల్లా ముమ్మిడివరం 31.5మిమీ, విజయనగరం జిల్లా మెంటాడలో 30మిమీ వర్షపాతం రికార్డయిందన్నారు. శనివారం తిరుపతి జిల్లా గంగుడుపల్లిలో 39.5 °C గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపారు.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: