2 తుఫానులు.. 3 వాయుగుండాలు.. 3 అల్పపీడనాలు..
Tuesday, January 28, 2025 10:30 AM Weather
దక్షిణ భారతదేశం నుంచి ఈశాన్య రుతుపవనాలు సోమవారం నిష్క్రమించాయి. వాస్తవానికి 10 రోజుల ముందే ఈ ప్రక్రియ పూర్తవ్వాల్సి ఉండగా వాతావరణ మార్పులతో కాస్త ఆలస్యమైంది. ఈ సీజన్ లో మొత్తంగా 2 తుఫాన్లు, 3 వాయుగుండాలు, 3 అల్పపీడనాలు వచ్చాయి.
దక్షిణ భారతదేశంలోకి అక్టోబర్ 15న రుతుపవనాలు ప్రవేశించాయి. ఈ సీజన్లో ఆంధ్రపదేశ్ లో 286.5 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా 10 శాతం అధికంగా 316.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాయలసీమలో 46 శాతం అధిక వర్షపాతం రికార్డయింది, ఉత్తర కోస్తాలో తక్కువ వర్షం కురిసింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
