అసుస్ నుండి జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో మ్యా2 స్మార్ట్ ఫోన్ విడుదల
Thursday, December 6, 2018 11:26 PM Technology
దిగ్గజ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ అసుస్ తమ నూతన స్మార్ట్ఫోన్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం2ను ఇవాళ విడుదల చేసింది. ఈ ఫోన్ రూ.19,140 ధరకు వినియోగదారులకు ఈ నెల 12వ తేదీ నుంచి లభ్యం కానుంది. 6.3 అంగుళాల భారీ డిస్ప్లే గల దీనికి గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ను అందించింది. వెనుక వైపున 12 మరియు 5 మెగాపిక్సల్ కెమెరాలు రెండు ఉండగా, ముందు భాగంలో 13 మెగాపిక్సల్ కెమెరా ఉంది. దీనికి ఫ్లాష్ సదుపాయం కూడా కలదు. ఈ ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలదు. డెడికేటెడ్ మైక్రోఎస్డీ కార్డు స్లాట్ను కూడా ఏర్పాటు చేశారు. డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ సపోర్ట్ గల ఇందులో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న భారీ బ్యాటరీ ఈ ఫోన్లో ఉంది.
అసుస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం2 స్మార్ట్ఫోన్లోని ఫీచర్లు...
- 6.3 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే మరియు గొరిల్లా గ్లాస్6 ప్రొటెక్షన్
- 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ - 4 జీబీ ర్యామ్
- 64/128 జీబీ స్టోరేజ్ మరియు 2 టీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్
- ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
- డ్యుయల్ సిమ్
- 12 & 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
- 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
- ఫింగర్ ప్రింట్ సెన్సార్
- డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ
- బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
For All Tech Queries Please Click Here..!