IPL 2025: ఫలించిన 18 యేళ్ళ పోరాటం... ఈ సారి కప్ RCB దే
_(24)-1748973294.jpeg)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 ఏళ్ల పోరాటం ఫలించింది. మంగళవారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై ఆర్సీబీ విజయం సాధించి తొలి సారి ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచింది. షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే లీగ్ ముగియాల్సి ఉంది. కానీ భారత్-పాక్ యుద్ధం కారణంగా వారం పాటు ఐపీఎల్ వాయిదా పడింది. ఇక ఆర్సీబీ తుది పోరులో తలపడడం ఇది నాలుగోసారి. 2009, 2011, 2016ల్లో టైటిల్పై ఆశలు పెట్టుకున్నా రన్నర్పగానే నిలిచింది. ‘ఈ సాల కప్ నమ్దే’ అంటూ బెంగళూరు జట్టు అభిమానులు ప్రతీసారి హోరెత్తిస్తుంటారు. వీరి నమ్మకాన్ని నిలబెడుతూ ఈసారి అదిరే ప్రదర్శనతో కప్ ను సొంతం చేసుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 190 పరుగులు చేసింది. PBKS కెప్టెన్ అయ్యర్ (1) ఫెయిలవ్వడంతో మ్యాచ్ RCBపైపు తిరిగింది. చివర్లో శశాంక్ హాఫ్ సెంచరీతో చెలరేగినా ఫలితం లేకపోయింది. పంజాబ్ 184 పరుగులతో సరిపెట్టుకుంది. RCB బౌలింగ్లో భువనేశ్వర్, కృణాల్కు చెరో 2 వికెట్లతో సత్తా చాటారు. బ్యాటింగ్లో కోహ్లి(43) రాణించారు.