ధోనీకి మరో అరుదైన గౌరవం
_(29)-1749520693.jpeg)
ఎంఎస్ ధోనీకి మరో గౌరవం దక్కింది. క్రికెట్ కు చేసిన అత్యుత్తమ సేవలకు గాను ఐసీసీ ధోనిని ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లోకి చేర్చింది. మొత్తం 538 అంతర్జాతీయ మ్యాచుల్లో 17266 పరుగులు చేశారు. మూడు ఐసీసీ ట్రోఫీలను అందించిన కెప్టెన్ గా నిలిచారు. కాగా లండన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ధోనితో పాటు క్రికెట్ దిగ్గజాలు మాథ్యూ హేడెన్, హషీమ్ ఆమ్లా, గ్రేమ్ స్మిత్, డేనియల్ వెట్టోరి, సనా మీర్, సారా టేలర్లను కూడా హాల్ ఆఫ్ ఫేమ్ లోకి చేర్చారు.
2004లో ధోని జాతీయ జట్టులోకి అడుగుపెట్టినప్పుడు, అప్పటి 23 ఏళ్ల యువకుడు వికెట్ కీపర్-బ్యాటర్గా ఈ స్థాయికి ఎదుగుతాడని బహుషా ఎవరూ ఊహించి ఉండరు. స్టంప్స్ వెనుక ధోని టెక్నిక్ అసాధారణమైనది. అతను వికెట్ కీపింగ్ను ఒక ఆర్ట్గా మార్చాడు. డిఫ్లెక్షన్ల నుండి రనౌట్లను ప్రభావితం చేశాడు, రెప్పపాటులో స్టంపింగ్లను పూర్తి చేశాడు. తనదైన శైలితో క్యాచ్లను తీసుకున్నాడు. బ్యాటింగ్లోనూ విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడగలడు, ఇతరులతో కలిసి మంచి పార్ట్నర్షిప్లు నిర్మించగలడు.