సరిహద్దుల్లో ఉద్రిక్తతలు.. క్రికెట్ మ్యాచులు రద్దు
Friday, May 2, 2025 10:03 PM Sports

భారత సరిహద్దుల్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల కారణంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్ మరియు పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన దృష్ట్యా ఆగస్టు నెలలో బంగ్లాదేశ్ తో జరగాల్సిన ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ ను రద్దు చేయాలని బీసీసీఐ యోచిస్తోంది. సరిహద్దుల్లో భద్రతాపరమైన ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఆటగాళ్ల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: