ఎన్నికల వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు: వైసిపి
Saturday, August 9, 2025 04:25 PM Politics
రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులను వైసిపి నాయకులు కలిశారు. అనంతరం మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ టీడీపీ దౌర్జన్యాలపై చర్యలు కోరుతూ వినతి పత్రం సమర్పించామన్నారు. పులివెందులలో ఎన్నికల వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని తెలిపారు.
ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తుంటే రాష్ట్ర ఎన్నికల సంఘం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. కడప జిల్లా కలెక్టర్, ఎస్పీ, టీడీపీకి అనుకూలంగా పనిచేస్తుంటే ఎన్నికల సంఘం ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)