టీడీపీ తొలి అసెంబ్లీ అభ్యర్థి టికెట్ ఖరారు
తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి అసెంబ్లీ అభ్యర్థిని ఖరారును చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్ఖాన్ కుమార్తె షబానా ఖాతూన్కు వచ్చే ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టికెట్ను ఇస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ తొలి సీటును మైనార్టీ మహిళకు ఖరారు చేశారు. పార్టీ అధినేత అధికారికంగా ఖరారు చేసిన మొదటి ఎమ్మెల్యే సీటు కూడా ఇదే కావడం గమనార్హం.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తొలిసారిగా 1967లో ఏర్పడింది. అప్పటి నుండి 2014 వరకు 11 సార్లు ఎన్నికలు జరిగాయి. దాదాపు అన్ని ఎన్నికల్లో కూడా ప్రజలు మైనారిటీ అభ్యర్థులనే అసెంబ్లీకి పంపారు. దీంతో టీడీపీ పార్టీ అధినాయకుడు చాకచక్యంగా ఈ సీటును ముస్లిం మహిళకు కేటాయించారనే తెలుస్తోంది.