కులగణనపై కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: జగన్
Thursday, May 1, 2025 05:12 PM Politics

కులగణనపై కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఈ మేరకు సమాజంలోని అన్ని వర్గాలకు అసలైన సామాజిక న్యాయం ఈ ప్రక్రియ ద్వారా జరుగుతుందని వెల్లడించారు. సమ్మిళిత అభివృద్ధికి ఇది కీలక అడుగని జగన్ తెలిపారు. వెనుకబడిన వర్గాల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి కులగణన దోహదపడుతుందని పేర్కొన్నారు. 2024 జనవరిలో దేశంలోనే తొలిసారిగా కులగణన చేసినట్లు జగన్ తెలియజేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: