పోలీసులు, టీడీపీ నాయకులు కుమ్మక్కయ్యారు: బొత్స
Friday, August 8, 2025 08:41 AM Politics
ఏపీ పోలీసుల తీరుపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో పోలీసులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కుమ్మక్కె, వైసిపి నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ముఖ్యంగా ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఈ దాడులు పెరిగాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది ప్రజాస్వామ్యానికి విరుద్దమని ఆయన పేర్కొన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



