గెలుపే లక్ష్యంగా కేసీఆర్‌ను ఫాలో అవుతున్న చంద్రబాబు

Saturday, March 9, 2019 08:22 PM Politics
గెలుపే లక్ష్యంగా కేసీఆర్‌ను ఫాలో అవుతున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల అగ్గి రాజేసుకుంది... మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సరికొత్త వ్యూహాలతో ముందుకెళుతున్నారు. తాజాగా డేటా చోరీ కేసు వ్యవహారంలో వైసీపీ, టీఆర్ఎస్, బీజేపీ కలిసి టీడీపీని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపిస్తున్న చంద్రబాబు... తాజాగా ఈ కేసు వైసీపీ, టీఆర్ఎస్ కుట్రలో భాగమే అంటూ పలు ఆధారాలను మీడియా ముందుకు తెచ్చారు. చంద్రబాబు బయటపెట్టిన ఆధారాలు నిజమేనా ? కాదా ? అనే అంశం పక్కనపెడితే... రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఏ నినాదంతో ముందుకు వెళుతుందనే అంశంపై టీడీపీ అధినేత స్పష్టత ఇవ్వడం విశేషం.

చంద్రబాబు నాయుడు తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో పలు అంశాలపై స్పందించి తెలుగు రాష్ట్రాల్లో టీడీపీకి ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న వైకాపా మరియు టీఆర్ఎస్ పార్టీలను టార్గెట్ చేశారు. అంతే కాకుండా... చంద్రబాబు కావాలా... కేసీఆర్ కావాలా అంటూ కొత్త నినాదాన్ని తీసుకొచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే కేసీఆర్ ఇటీవల జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టేసి ప్రధాన పోటీ టీడీపీతోనే అంటూ ప్రచారాన్ని సాగించి మీకు ఎవరి ప్రభుత్వం కావాలో తేల్చుకోండి అని పోటీలో ఏకగ్రీవంగా విజయం సాధించారు. ఇప్పుడు చంద్రబాబు కూడా ఇదే పద్దతిని అనుసరిస్తున్నట్లు తాజాగా జరిగిన మీడియా సమావేశం ద్వారా తెలుస్తోంది. అవును... ఎప్పుడూ వైకాపా మరియు బీజేపీ పార్టీలను టార్గెట్ చేసిన చంద్రబాబు ఇప్పుడు వైకాపాను కార్నర్ చేసి పోటీ జగన్‌తో కాదు కేసీఆర్‌తో అని చెప్పారు. దీంతో ప్రజలు వైసీపీని పెద్దగా పట్టించుకోకుండా టీడీపీ మరియు టీఆర్ఎస్ పార్టీలలో బెస్ట్ ఆప్షన్ ఎంచుకుంటారనేది చంద్రబాబు ఆలోచన అని చెప్పకనే తెలుస్తోంది.

For All Tech Queries Please Click Here..!