తొలి మహానాడు.. దాని నేపధ్యం..
Tuesday, May 27, 2025 10:53 AM Offbeat
_(21)-1748323408.jpeg)
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాక ముందు 1982లో ఏప్రిల్ 10, 11వ తేదీలలో హైదరాబాద్లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్లో ఈ మహానాడు సభను తొలిసారిగా నిర్వహించారు. అదే ఏడాది మే 27, 28 తేదీలలో తిరుపతి త్యాగరాజ మండపంలో మహానాడు పేరుతో మరో సభను నిర్వహంచారు. అయితే మహానాడును పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జన్మదినం మే 28వ తేదీన నిర్వహించాలని పార్టీలోని పెద్దలు నిర్ణయించారు. దీంతో ఆ ప్రాతిపదికగా ఈ మహానాడును నిర్వహిస్తున్నారు.
2024 ఎన్నికలలో కూటమి ఘన విజయం సాధించింది. దీంతో సీఎంగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. దాంతో అధికారిక హోదాలో 2025 టీడీపీ మహానాడు వైఎస్ జగన్ సొంత ఇలాకా కడపలో నిర్వహిస్తున్నారు. మే 27, 28 తేదీలలో ప్రతినిధులతో సభలు, మే 29వ తేదీన అంటే చివరి రోజు నిర్వహించే సభకు దాదాపు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: