Breaking: జైలు నుండి వల్లభనేని వంశీ విడుదల

Wednesday, July 2, 2025 03:10 PM News
Breaking: జైలు నుండి వల్లభనేని వంశీ విడుదల

విజయవాడ జిల్లా జైలు నుంచి వల్లభనేని వంశీ విడుదలయ్యారు. నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఈ కేసుపై మంగళవారం నూజివీడు కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. అనంతరం వంశీకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

లక్ష రూపాయలకు 2 ష్యూరిటీలు, వారానికి రెండుసార్లు స్టేషన్ కి రావాలంటూ కోర్టు షరతులు పెట్టింది. వల్లభనేని వంశీ ఈ కేసులో ఇప్పటివరకూ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజా బెయిల్‌తో ఇంతవరకూ వంశీపై నమోదైన అన్ని కేసుల్లోనూ ఆయనకి బెయిల్ మంజూరు అయినట్లయింది. దీంతో బుధవారం జిల్లా జైలు నుంచి వంశీ విడుదలయ్యారు. ఇంత కాలం రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీకి తాజా తీర్పు భారీ ఉపశమనమనే చెప్పాలి. అయితే, వంశీ బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: