Breaking: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఏపీ డీఎస్పీలు దుర్మరణం
Saturday, July 26, 2025 07:25 AM News
తెలంగాణలోని యాదాద్రి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు చక్రధర్రావు, శాంతారావు మృతి చెందారు. అడిషనల్ ఎస్పీ ప్రసాద్, డ్రైవర్ నర్సింగరావు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. వీరు ప్రయాణిస్తున్న స్కార్పియో చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద లారీని ఢీకొట్టడంతో ఘటన చోటు చేసుకుంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)