పెద్దపులి కలకలం.. భయాందోళనలో ప్రజలు
Monday, June 23, 2025 11:33 AM News
తెలంగాణలోని భూపాల్ పల్లి జిల్లా ఎడ్లపల్లి దగ్గర పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. నిన్న రాత్రి పెద్దపులి ఆవులపై దాడి చేసినట్లు స్థానికులు వెల్లడించారు. అదేవిధంగా గత మూడు రోజులుగా తాడిచెర్ల, కొయ్యూర్, మల్లారం, పెద్ద తుండ్ల, అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా పెద్దపులిని పట్టుకోవడానికి తగిన చర్యలు చేపట్టారు. ప్రజల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



