ఏపి యువకులతో ఉగ్రవాదులకు సంబంధాలు.. ఇద్దరు అరెస్ట్
Sunday, May 18, 2025 03:42 PM News
ఏపిలో ఉగ్రవాదానికి ఆకర్షితులైన ఇద్దరు అనుమానితులను హైదరాబాద్ పోలీసులు విజయనగరంలో అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. టెర్రరిస్ట్ ఐడియాలజీతో గడుపుతున్న సిరాజ్ ఉర్ రెహ్మాన్ (29)పై కొన్ని రోజులుగా నిఘా పెట్టి అరెస్టు చేశారు. అతడిచ్చిన సమాచారంతో హైదరాబాద్ కు చెందిన సయ్యద్ సమీర్ (28)ను అదుపులోకి తీసుకున్నారు. వీరిని కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలుస్తోంది. కాగా సిరాజ్ తండ్రి పోలీస్ శాఖలో పనిచేస్తున్నట్లు సమాచారం.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



