42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం ఆమోదం
Thursday, July 10, 2025 08:58 PM News
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం సుమారు 3 గంటల పాటు కొనసాగింది. అయితే రిజర్వేషన్లపై బిల్లులో సవరణలు చేయాలని,అందుకోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై అధికార పర్యటన త్వరలో వెలువడే అవకాశం ఉందని, ఈ నిర్ణయం బీసీ వర్గాల్లో ఆనందోత్సాహాలను కలిగించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



