వివేకా హత్యకేసు: అప్రూవర్ దస్తగిరికి భద్రత పెంపు
Friday, March 14, 2025 08:00 AM News
జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో అప్రూవర్ గా ఉన్న దస్తగిరికి ప్రభుత్వం భద్రత పెంచింది. గతంలో ఆయనకు 1+1 సెక్యూరిటీ ఉండగా ఇకపై 2+2కు పెంచి గన్మెన్లను కేటాయించారు. ఈ విషయాన్ని ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు.
వివేకా హత్య కేసులో సాక్షులు అనుమానాస్పదంగా మృతి చెందుతున్న నేపథ్యంలో తనకు భద్రత కల్పించాలని ఆయన దస్తగిరి విన్నవించారు. దీంతో ఆయనకు భద్రత పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



