నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు
Thursday, August 14, 2025 07:07 AM News
తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. మరో రెండు రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగనుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో స్కూళ్ళకు సెలవు ప్రకటించారు. జనగామ, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో గురువారం ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు మూసివేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
అలాగే జీహెచ్ ఎంసీ పరిధిలో అయితే నేడు ఒంటిపూట బడులు మాత్రమే నిర్వహించాలని ఆదేశించారు. మరో వైపు ఏపీలోనూ వర్షాలు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ డీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



