నేను ఏమన్నా నీ కొడుకులా తాగుబోతునా లేక తిరుగుబోతునా అంటూ పోసాని ఫైర్‌

Monday, March 18, 2019 08:25 PM News
నేను ఏమన్నా నీ కొడుకులా తాగుబోతునా లేక తిరుగుబోతునా అంటూ పోసాని ఫైర్‌

ఎన్నికల కమీషన్‌ ముందు హాజరుకావాలని వచ్చిన నోటీసులపై సినీ నటుడు, దర్శక మరియు రచయిత పోసాని కృష్టమురళి భగ్గుమన్నారు. తానేమన్నా చంద్రబాబు నాయుడి కొడుకులా తాగుబోతునా లేక తిరుగుబోతునా? అని ప్రశ్నించారు. పోసానితెరకెక్కిస్తున్న ‘ముఖ్యమంత్రి గారు.. మీరు మాట ఇచ్చారు’ సినిమా విడుదలను ఆపేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి లేఖ రావడంతో పోసాని సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు నాయుడిపై ధ్వజమెత్తారు. ఆయన గురించి అందరికి తెలుసు అని కొత్తగా సినిమాలు తీయాలా? అని ప్రశ్నించారు. ఆయన తిట్టని కులం లేదని మండిపడ్డారు. చంద్రబాబు అనుకూలంగా ఉంటే మంచోడు అని లేకుంటే చెడ్డోడా? అని ధ్వజమెత్తారు.

అసలు తనని ఎందుకు స్వయంగా రమ్మంటున్నారని ప్రశ్నించారు. నన్ను ఏమన్నా చంపేయడానికి ప్లాన్‌ చేశారా? లేకుంటే చంద్రబాబు దగ్గర నిలబెడుతారా? నేనెమన్నా, రౌడీ షీటర్‌నా, బ్రోకర్‌నా, నాపై ఇప్పటి వరకు ఏ కేసులేదు. ఎలాంటి వెదవ పనిచేయలేదు. మీ సుజనా చౌదరిలా ఏ బ్యాంకును మోసం చేయలేదు. నీ కొడుకులా అవినీతి చేయలేదు. ఆయనలా తాగుబోతు.. తిరుగుబోతును కాదు. అసలు ఈ సినిమాలో నేను ఏం చూపించానో.. ఏం చెప్పానో తెలియకుండా సినిమాను ఆపేయాలని ఎలా లేఖ రాస్తారు. వాడెవడో రాసిన లేఖకు ఈసీ ఎలా స్పందిస్తోంది. నాకు తెలుసు ఎలక్షన్ కమీషన్ గురించి.. కాని ఇలాంటి వాటివల్ల ఎలక్షన్ కమీషన్ చంద్రబాబుకి అనుకూలంగా మారిందా అని జనం అనుకుంటారు. అలాంటి అవకాశాన్ని ఇవ్వకూడదు. సినిమాకి ఎలక్షన్ కమీషన్‌కి సంబంధం లేదు. సినిమాకి సెన్సార్ బోర్డ్‌కు సంబంధం ఉంటుంది. నేను ఎవరికీ వ్యతిరేకంగా సినిమా తీయలేదు. ఏ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సినిమా తీయలేదు. ఎవర్నీ విమర్శించలేదు. సమాజానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీయలేదు. ‘అనగనగా ముఖ్యమంత్రి’ అంటే నా పాత సినిమాల్లో కూడా చాలామంది ముఖ్యమంత్రుల్ని చూపించాను. 

For All Tech Queries Please Click Here..!