మోడ్రన్ మమ్మీ: బిడ్డను ఎయిర్‌పోర్టులో మరిచిపోయి విమానం ఎక్కేసింది

Tuesday, March 12, 2019 11:49 AM News
మోడ్రన్ మమ్మీ: బిడ్డను ఎయిర్‌పోర్టులో మరిచిపోయి విమానం ఎక్కేసింది

ప్రయాణానికి ముందు మన వెంట తెచ్చుకున్న ఏ ఒక్క బ్యాగును కూడా మర్చిపోకుండా జాగ్రత్తపడతాం. ప్రత్యేకించి విమాన ప్రయాణాల్లో అయితే ఒకటికి పదిసార్లు గుర్తు చేసుకుని మరీ జాగ్రత్తపడుతుంటాం. అలాంటిది ఓ తల్లి తన చంటి బిడ్డను ఎయిర్‌పోర్టులోనే వదిలేసి విమానం ఎక్కేసింది. ఈ ఘటన సౌదీ అరేబియాలోని కింక్ అబ్దుల్లాజీజ్ విమానాశ్రయంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే, కాసేపట్లో విమానం ఎక్కాల్సిన మహిళ లగేజీ మొత్తాన్ని జాగ్రత్తగానే వెంట తెచ్చుకుంది. అయితే అంత వరకు ఎయిర్‌పోర్టులోని వెయిటింగ్ రూమ్‌లో ఉన్న ఆమె తన నవజాత శిశువును మరిచిపోయి విమానం ఎక్కసేంది. టేకాఫ్ తీసుకొని కొద్ది దూరం వెళ్లాక ఏదో మరిచిపోయినట్లు గుర్తుకుతెచ్చుకున్న ఆ మహిళ తన బిడ్డను విమానాశ్రయంలోనే వదిలేసినట్లు సిబ్బందికి తెలిపింది. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగాన్ని సంప్రదించి విషయాన్ని వివరించగా... ఆ విమానం వెనక్కి వచ్చేందుకు ఏటీసీ అధికారులు అనుమతులిచ్చారు. విమానం ల్యాండ్ అయ్యాక విమానాశ్రయ సిబ్బంది శిశువును ఆమె తల్లికి అప్పగించడంతో కథ సుఖాంతం అయ్యింది.

For All Tech Queries Please Click Here..!