ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు విడుదల
Sunday, August 31, 2025 11:39 AM News
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ తీపికబురు చెప్పింది. పెండింగ్ లో ఉన్న రూ.700 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసింది. వీటిలో గత 20 నెలలుగా పెండింగ్ లో ఉన్న సప్లమెంటరీ జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసింది.
పెండింగ్ బిల్లులను నెలనెలా రూ.700 కోట్ల చొప్పున దశలవారీగా ఇస్తామని మంత్రివర్గం ప్రకటించింది. కాగా ఈ నెలకు సంబంధించిన రూ.700 కోట్లను ఉద్యోగుల ఖాతాల్లో వేసినట్లు ఆర్థికశాఖ వర్గాలు వెల్లడించాయి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



