వారి సాయం కోరుతున్న పాకిస్తాన్..!

Sunday, April 27, 2025 10:14 PM News
వారి సాయం కోరుతున్న పాకిస్తాన్..!

పహల్గామ్ జరిగిన ఉగ్రవాద దాడిపై భారత్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దీంతో సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం పాకిస్తాన్ని కలవరానికి గురిచేస్తోంది. ఈ ఘటనపై పాకిస్తాన్ దారుణమైన విధంగా స్పందిస్తోంది, కాగా ఆ దేశం యుద్ధానికి దారితీసే చర్యలు తీసుకోవడాన్ని నివారించేందుకు రష్యా, చైనా సాయం కోరుతోందని తెలుస్తోంది.

మంగళవారం జరిగిన పహల్గామ్ దాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి పాకిస్తాన్‌లోని నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ప్రతినిధి రెసిస్టెన్స్ ఫ్రంట్  బాధ్యత వహించింది. ఈ ఘటనపై పాకిస్తాన్ దారుణమైన విధంగా స్పందిస్తోంది, కాగా ఆ దేశం యుద్ధానికి దారితీసే చర్యలు తీసుకోవడాన్ని నివారించేందుకు రష్యా, చైనా సాయం కోరుతోందని తెలుస్తోంది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, రష్యా మీడియాతో మాట్లాడుతూ, రష్యా మరియు చైనా ఈ సమయంలో సానుకూల పాత్ర పోషించగలవని పేర్కొన్నారు. భారత్ చేసిన వ్యాఖ్యలు నిజమా లేక అబద్ధమా అని నిర్ధారించేందుకు అంతర్జాతీయ దర్యాప్తు బృందం ఏర్పాటు చేయవచ్చని ఆయన చెప్పారు. ఈ ఘటనపై పాకిస్తాన్ ప్రధాని మరియు ఉపప్రధాని కూడా స్పందించారు. పాకిస్తాన్ ఉపప్రధాని ఇషాక్ దార్, పహల్గామ్ దాడిని స్వాతంత్ర్య యోధులు చేశారు అని పేర్కొన్నారు. పాకిస్తాన్ వారిచ్చిన వ్యాఖ్యలు ఆధారాలు లేని ప్రకటనలేనని, ఆధారాలు లేకుండా పాకిస్తాన్‌పై ఆరోపణలు చేయడం సరికాదు అని పేర్కొన్నారు.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: