మిస్ వరల్డ్-2025 విజేత ఈమెనే..

Saturday, May 31, 2025 10:10 PM News
మిస్ వరల్డ్-2025 విజేత ఈమెనే..

మిస్ వరల్డ్-2025 విజేతగా థాయిలాండ్ సుందరీమణి ఒపల్ సుచత ఎంపికయ్యారు. ఈమెకు రూ.8.5 కోట్ల ప్రైజ్ మనీ అందనుంది. మిస్‌వరల్డ్ మొదటి రన్నరపగా మిస్ ఇథియోఫియా, రెండో రన్నరప్‌గా మిస్ పోలాండ్‌కు దక్కింది. 

ఈ పోటీలలో మిస్ ఇండియా నందిని గుప్తాకు నిరాశ ఎదురైంది. టాప్ 8లో స్థానం దక్కించుకోలేకపోవడంతో ఆమె నిష్క్రమించింది. ఇది భారత అభిమానులకు కొంత నిరాశ కలిగించినప్పటికీ పోటీలలో అంతర్జాతీయ ప్రాతినిధ్యం బలంగా ఉంది. మార్టినిక్, బ్రెజిల్, ఇథియోపియా, నమీబియా, పోలండ్, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్ దేశాల అందాల భామలు మిస్ వరల్డ్ టాప్ 8లో చోటు దక్కించుకున్నారు. ఆసియా ఖండం నుంచి థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్ సుందరీమణులు టాప్ 8కు అర్హత సాధించడం విశేషం. టాప్ 8 నుంచి టాప్ 4ను ఎంపిక చేసి, అందులో నుంచి థాయ్‌లాండ్ సుందరిని మిస్ వరల్డ్ 2025 విజేతగా ప్రకటించారు. ఈ భారీ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, సినీ నటి ఖుష్బూ, ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు హాజరయ్యారు. మిస్ వరల్డ్ విజేతకు రూ. 8.5 కోట్ల నగదు, 1770 వజ్రాల కిరీటం, మరియు ఏడాది పాటు ఉచితంగా ప్రపంచ యాత్ర సౌకర్యం కల్పించనున్నారు. ఈ బహుమతులు విజేతకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుతో పాటు, సామాజిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తాయి. గతంలో, 71వ మిస్ వరల్డ్ పోటీలలో చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన క్రిస్టినా పిస్కోవా విజేతగా నిలిచి ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్నారు. ఆ పోటీలలో లెబనాన్‌కు చెందిన అజైటౌన్ రన్నరప్‌గా నిలిచారు. 28 ఏళ్ల తర్వాత భారత్ వేదికగా జరిగిన ఈ మిస్ వరల్డ్ పోటీలు, ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా ముగిశాయి. తర్వాత మళ్లీ హైదరాబాద్ ఈ వేడుకకు వేదికగా నిలిచింది.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: