Breaking: ఏపిలో భారీ ఎన్ కౌంటర్
Wednesday, June 18, 2025 10:42 AM News
అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోని కొయ్యలగూడెం సమీపంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో మావోయిస్టులు ఎదురుపడటంతో ఇరువర్గాల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి.
ఈ ఎన్ కౌంటర్లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు ఉదయ్, జోనల్ కమిటీ సభ్యురాలు అరుణతో పాటు మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



