బ్రతికుండగానే స్మశానవాటికకు
Sunday, June 15, 2025 06:13 PM News

మానవత్వం రోజు రోజుకు మంటకలిసిపోతోంది. అందుకు నిదర్శనమే జగిత్యాల జిల్లా ధర్మపురిలో వెలుగులోకి వచ్చింది. ధర్మపురి పట్టణానికి చెందిన గోపి అనే వ్యక్తి హోటల్ నడిపిస్తూ బ్రతికీడుస్థున్నాడు. ఐతే గోపి ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలయ్యాడు.
పరిస్థితి విషమించడంతో తిరిగి ధర్మపురికి తీసుకొచ్చారు. ఐతే గోపి పరిస్థితిని చూసి తాను ఉంటున్న అద్దె ఇంట్లోకి యజమాని రానివ్వలేదు. గత్యంతరం లేక బ్రతికుండగానే కుటుంబీకులు శ్మశానవాటికకు తరలించి సపర్యలు చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: