పులివెందులలో నేడు వైఎస్‌ జగన్‌ నామినేషన్‌.

Friday, March 22, 2019 08:40 AM News
పులివెందులలో నేడు వైఎస్‌ జగన్‌ నామినేషన్‌.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు శుక్రవారం(22మార్చి 2019) మధ్యాహ్నం 1.40 నుంచి 1.49 నిమిషాల మధ్యలో జగన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఎన్నికల నామినేషన్ వేయడానికి ఇక మూడు రోజులే మిగిలి ఉండడంతో ఇవాళ ఆయన నామినేషన్ వేస్తున్నారు. ఉదయం10గంటలకు ఆయన హెలికాప్టర్‌ ద్వారా పులివెందులకు చేరుకుంటారు. స్థానిక సీఎస్‌ఐ చర్చి మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం నామినేషన్‌ పూర్తయ్యాక హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్తారని మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి మీడియాకు తెలిపారు.

జగన్ నామినేషన్ నేపథ్యంలో పులివెందులలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు ర్యాలీలు చేస్తూ సందడి చేస్తున్నారు. పులివెందుల నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి వేలాదిగా కార్యకర్తలు తరలిరావటంతో పులివెందుల అంతా సందడిగా ఉంది.

For All Tech Queries Please Click Here..!