మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలపై విచారణకు ఆదేశం
Sunday, May 25, 2025 08:33 PM News

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ కేంద్రంగా నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి పోటీలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. పోటీలపై తాజాగా మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. కాగా ఈ ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. వెంటనే విచారణకు ఆదేశించింది. సీనియర్ ఐపీఎస్ అధికారి శిఖా గోయల్, ఐపీఎస్ రెమా రాజేశ్వరి, సైబరాబాద్ డీసీపీ సాయిశ్రీ ఆధ్వర్యంలో విచారణ కమిటీని నియమించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: