టెర్రర్ ఎటాక్: పాక్ పై భారత్ కఠిన నిర్ణయాలు

Thursday, April 24, 2025 12:24 PM News
టెర్రర్ ఎటాక్: పాక్ పై భారత్ కఠిన నిర్ణయాలు

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో 26 మంది ప్రాణాలను బలిగొన్న ఉగ్రదాడి ఘటనలో "బాహ్య శక్తుల హస్తం" ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడి కావడంతో, భారత ప్రభుత్వం పాకిస్థాన్‌పై పలు కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. దేశ భద్రతకు సంబంధించిన అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) ఈ మేరకు కీలక చర్యలకు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా దశాబ్దాల నాటి సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిరవధికంగా నిలిపివేయడం, అటారీ-వాఘా సరిహద్దును తక్షణమే మూసివేయడం వంటి ప్రధాన నిర్ణయాలున్నాయి.

భారత్ తీసుకున్న అత్యంత కీలకమైన చర్యల్లో 1960 నాటి సింధు నదీ జలాల ఒప్పందాన్ని తక్షణమే నిరవధికంగా నిలిపివేయడం ఒకటి. ఈ ఒప్పందం ప్రకారం సింధు, దాని ఉపనదులైన జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ నదుల జలాలను ఇరు దేశాలు పంచుకుంటున్నాయి. పాకిస్థాన్‌లోని కోట్ల మంది ప్రజలకు ఈ నదులే ప్రధాన నీటి వనరు. 1960 సెప్టెంబర్ 19న ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్థాన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. 1965, 1971, 1999 యుద్ధాల సమయంలోనూ నిలిచిన ఈ చారిత్రక ఒప్పందాన్ని భారత్ ఇప్పుడు నిలిపివేసింది.అటారీ-వాఘా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్‌ను తక్షణమే మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సార్క్ వీసా మినహాయింపు పథకం (ఎస్.వీ.ఈ.ఎస్.) కింద పాకిస్థానీయులకు వీసాలు నిలిపివేశారు. న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌లోని నేవల్, ఎయిర్ అడ్వైజర్లను 'పర్సన నాన్ గ్రాటా' (అవాంఛనీయ వ్యక్తులు)గా ప్రకటించారు. వారు వారం రోజుల్లోగా భారత్ విడిచి వెళ్లాలని ఆదేశించారు. సీసీఎస్ సమావేశంలో భద్రతా పరిస్థితులను సమీక్షించి, భద్రతా దళాలను అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు విక్రమ్ మిస్రీ తెలిపారు.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: