డీఎస్సీపై హైకోర్టు కీలక తీర్పు
Tuesday, June 3, 2025 07:00 AM News
_(31)-1748914199.jpeg)
ఏపిలో 16347 టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. జూన్ 6 నుంచి ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్స్ సైతం విడుదలయ్యాయి. కాగా ఈ మెగా డీఎస్సీ వాయిదా వేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ప్రభుత్వ న్యాయవాది వాదనలతో ఏకీభవించి పరీక్షలను నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: