అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్
Saturday, June 14, 2025 10:34 AM News

అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట లభించింది. ఈడీ ద్వారా జప్తు చేయబడిన అగ్రిగోల్డ్ ఆస్తులను బాధితులకు పంపిణీ చేసేందుకు కోర్టు అనుమతించింది. ఈ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్ లో రూ. 6 వేల కోట్లు ఉంటుందని అంచనా. కాగా ఏపీ, తెలంగాణ, కర్ణాటకఒడిషా రాష్ట్రాల్లో కలిపి 19 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నట్లు ఈడీ తేల్చింది. ఇప్పటికే ఈ స్కాం లో 33 మందిపై ఈడీ కేసు నమోదు చేసింది. వారి ఆస్తులను జప్తు చేసిన ఈడీ ఆస్తులను పంపిణీ చేయనుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: