పసిడి ప్రియులకు షాక్.. మళ్ళీ పెరిగిన బంగారం ధరలు
Wednesday, March 12, 2025 11:03 AM News
పసిడి ప్రియులకు షాక్ తగిలింది. బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.450 పెరిగి రూ.80,650లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.490 పెరిగి రూ.87,980కు చేరింది.
మరో వైపు వెండి ధర రూ.100 తగ్గడంతో కేజీ సిల్వర్ ధర రూ.1,06,900గా ఉంది. వివాహ శుభకార్యాల నేపథ్యంలో బంగారం, వెండికి భారీ డిమాండ్ నెలకొన్న సంగతి తెలిసిందే.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



