వినాయక మండపాలకు ఉచిత విద్యుత్
Monday, August 25, 2025 06:46 PM News
వినాయక చవితి సందర్భంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించింది. వినాయక చవితికి మాత్రమే కాదు విజయదశమి సందర్భంగా ఏర్పాటు చేసే దుర్గామాత మండపాలకు కూడా ఫ్రీ కరెంట్ ఇవ్వనున్నారు.
ఈ విషయాన్ని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. వినాయక చవితి, దసరా ఉత్సవాల ఉచిత విద్యుత్ కోసం రూ.25 కోట్లు కూటమి ప్రభుత్వం వెచ్చించనుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
