Breaking: ఏపిలో భూకంపం

Monday, June 9, 2025 09:48 AM News
Breaking: ఏపిలో భూకంపం

ప్రకాశం జిల్లాలో అర్ధరాత్రి భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురి చేశాయి. ముండ్లమూరు పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రి రెండు సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానిక ప్రజలు చెబుతున్నారు.

కాగా ఇటీవల కాలంలో గుండ్లకమ్మ నది పరిసరాల్లో తరచుగా భూ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. తాజా ప్రకంపణలపై అధికారులు స్పందిస్తూ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. కాగా మే 6న ప్రకాశం జిల్లాలోని పొదిలి, కురిచేడు, ముండ్లమూరు మండలాల్లో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. ఇవి ఐదు సెకన్ల పాటు కొనసాగాయి, పెద్ద ఎత్తున శబ్దాలతో భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. దీంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ముండ్లమూరు మండలంలోని శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, వేంపాడు, మారెళ్ల, తూర్పు కంభంపాడు గ్రామాల్లో గతంలో స్వల్ప భూ ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ సంఘటనల సమయంలో విద్యార్థులు, ఉద్యోగులు భయంతో బయటకు పరుగెత్తారు. తాళ్లూరు, గంగవరం, రామభద్రాపురం గ్రామాల్లో కూడా రెండు సెకన్ల పాటు భూమి కంపించిన సందర్భాలు ఉన్నాయి.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: