వంతెన కూలిన ఘటన: మృతదేహాల వెలికితీత
Monday, June 16, 2025 09:15 AM News

మహారాష్ట్రలో పురాతనమైన ఇంద్రాయణి నదీ వంతెన కూలి ఆరుగురు గల్లంతైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు ఇప్పటి వరకు నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. అంతే కాకుండా ఈ ప్రమాదంలో 51 మందికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు.
ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు మహారాష్ట్ర సీఎం వెల్లడించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: