Airtel కీలక ప్రకటన

Wednesday, April 23, 2025 10:58 AM News
Airtel కీలక ప్రకటన

టెలికాం దిగ్గజ సంస్థ Airtel కీలక ప్రకటన చేసింది. 2022లో 5జీ స్పెక్ట్రమ్ వేలంలో 400 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ ను అదానీ డేటా నెట్వర్క్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ వినియోగ హక్కులను పొందుతామని ఎయిర్టెల్ ప్రకటన చేసింది. దీంతో అదానీ డేటా నెట్వర్క్స్ కు చెందిన స్పెక్ట్రమ్ ను ఎయిర్టెల్ వినియోగించే మార్గం సుగమం అయ్యింది. ఎయిర్టెల్ 5జీ సేవల విస్తరణకు ఇది కీలకంగా మారనుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: